జనం ఛస్తే నాకేమి … బతికితే నాకేమి – మానవహక్కుల కమిషను ఛైర్మన్‌ తీరూతెన్ను


14 డిసెంబరు 2011. హైదరాబాదు.
ఉదయం 9.30 గంటల సమయం. బస్సులో రాంనగర్‌ నుంచి ఎస్సార్‌ నగర్‌ నందున్న మా కార్యాలయానికి వెళ్తుండగా ఖైరతాబాద్‌లోని ఓ ఇంటి గోడ మీద కన్పించిందా ఆంగ్ల ప్రకటన. మహిళల హక్కుల పరిరక్షణ సదస్సు బెంగళూరులో జరగబోతుందట. ఆ సదస్సులో మాజీ న్యాయమూర్తి వెంకటాచలయ్యతోపాటు రాష్ట్ర హక్కుల కమిషను ఛైర్మన్‌గా పనిచేసిన సుభాషణరెడ్డి ప్రసంగిస్తారు. అది చదవగానే నాకు గతంలో జరిగిన ఓ సంఘటన గుర్తుకొచ్చింది.
బహుశా రెండేళ్లవుతుందనుకుంటాను ఈ సంఘటన జరిగి. నా మిత్రడొకరిని కలుసుకుందామని జూబ్లీహిల్స్‌కు వెళ్లాను. అతని ఇల్లూ, కార్యాలయమూ పక్కపక్కనే ఉంటాయి. నేను కార్యాలయంలోనే నా మిత్రుడిని కలుసుకుంటుంటాను. ఆ రోజు కూడా కార్యాలయానికి వెళ్లగా అతను ఇంకా రాలేదనీ, ఇంట్లోనే ఉన్నాడనీ సిబ్బంది చెప్పారు. అందువలన మిత్రుడిని కలిసే వెళ్తామని ఆనాటి దినపత్రికలు చదువుతూ అక్కడే కూర్చున్నాను.
అరగంట తర్వాత నా మిత్రుడు వస్తూనే, ”అనుకోకుండా ఓ పెద్దమనిషి చెప్పా పెట్టకుండా వచ్చిందికాక నా సమయాన్నంతా తినేశాడు సుబ్బారావ్‌” అన్నాడు.
”ఎవరా పెద్దమనిషి” వాకబు చేశాను నేను.
”నువ్వు వింటే ఆశ్చర్యపోతావు!” అన్నాడు మిత్రుడు.
”ఇప్పుడు జరిగేవన్నీ విచిత్రాలే గదా! ఇంతకీ ఎవరా పెద్దమనిషి? పట్టు వదలకుండా మళ్లీ అడిగాను.
”నీకు వాస్తవం చెప్పకుండా ఉండలేను, చెబితే వార్త రాసేస్తావని భయంగానూ ఉంది”
”నిన్ను ఇరుకున పడేయనులే. చెప్పు, నువ్వు రాయమంటేనే వార్త రాస్తాను. లేకపోతే లేదు. విషయం తెలుసుకోవాలిగా” అంటూ ఒత్తిడి చేశాను నేను.
”మానవ హక్కుల కమిషను ఛైర్మను లేడూ …. .. వచ్చింది ఆయనే. అదిగో అక్కడ కొండ కన్పిస్తున్నది చూడు. (సమీపంలోనే ఉంది) దాన్ని గవర్నమెంటు నుంచి ఆయన బంధువు కంకర రాయి కొట్టుకునేందుకుగాను లీజుకు తీసుకున్నాడు. గత వారం రోజుల నుంచీ పేలుడు పదార్ధాలు ఉపయోగించి కొండను పేలుస్తున్నాడు. రాళ్లు వేగంగా ఎగిరొచ్చి ఈ చుట్టుపక్కల ఇళ్లమీదా, ఇళ్లల్లోనూ పడుతున్నాయి. కొంతమందికి దెబ్బలు కూడా తగిలాయి. కాంట్రాక్టరుకు ఎంత చెప్పినా వినకపోవటంతో తట్టుకోలేక అందరూ కలిసి పోలీసు స్టేషనుకు వెళ్లారు. పైగా మా బంధువు ఫలానా న్యాయమూర్తి అంటూ అందరినీ బెదిరించాడు. కంకర కొట్టద్దని పోలీసులు చెప్పేశారు. ఇంకొకటేందంటే, హౌసింగ్‌ సొసైటీ నుంచి నేను కూడా కాంట్రాక్టరు మీద చర్య తీసుకోమని అర్జీ ఇచ్చాను. ఇక చూడు, ఈ పెద్ద మనిషి ఒకటే ఫోన్లు. నువ్వు చెబితే అందరూ వింటారు చెప్పమంటాడు. అదేందండీ మీరు మానవహక్కుల కమిషను జడ్జి అయి ఉండి ఇట్లా మాట్లాడటం ఏమీ బాగాలేదే! అన్నా వినడాయె. ఏదో దగ్గర బంధువు, ఏడుస్తున్నాడని చెప్పాల్సి వచ్చిందంటాడు. చూసీ చూడనట్లు ఉండండి సార్‌, మిగతాది నేను చూసుకుంటానుఅంటాడాయన. అప్పటికీ ”జనం బతుకు ముఖ్యమా? బంధువు ఆదాయం ముఖ్యమా??” అని ఘాటుగానే అడిగాను. అసలు విన్పించుకుంటే గదా! వినడు, ఆలోచించడు. తలబప్పి కట్టించాడంటే నమ్ము. జనందేముంది వెర్రోళ్లు, నీబోటి నోరున్నాడు పదిసార్లు ఏది చెబితే అదే నిజమని నమ్ముతారని నాకు నచ్చజెప్పబోతాడు తప్ప తను మాత్రం ఆలోచించడు అంటూ హెచ్‌ఆర్‌సి ఛైర్మన్‌ భాగోతాన్ని పూసగుచ్చాడు మిత్రుడు.
జనం కన్నా తన బంధువు కాంట్రాక్టు పనులే ముఖ్యమని బల్ల గుద్దినట్లు చెప్పాడట. హక్కుల దేముంది? సార్‌, ఎవడి కోసం ఎవరాగుతారు? అని బుట్టలో వేసుకునే ప్రయత్నాలను ఎలా చేశాడో? వివరించాడు.
అదండీ సంగతి… జనం కన్నా, జనం బతికే హక్కు కన్నా… జనం వాదన కన్నా, తన బంధువు ఆదాయమే ముఖ్యమని తాపత్రయ పడిన ఓ మానవ హక్కుల కమిషనరు తీరూతెన్నుకు ఓ చిన్న ఉదాహరణ ఇది

2 responses to this post.

  1. O maoist chanipoyinapudu meetings pedataru veelu, kani valle prajala aasthi ni naasanam chesinapudu okkadoo maatladadu. notiki annam tintunnaro inkemaina tintunnaro ee commission vaallu.

    జవాబు

  2. తెర వెనుక భాగోతాలు ఇలా shocking గానే వుంటాయి అనుకుంటా! కానీ ఇది నాకు నిజంగా షాకింగే సుబ్బారావు గారూ !

    జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.