Archive for జూన్ 18th, 2010

నాలుగో స్త్తంభం శిథిలం

  • ప్రజాస్వామ్యమనే భవనానికి పత్రికా రంగం నాలుగో స్త్తంభమని భావిస్తారు. మిగతా మూడు స్తంభాలమాదిరిగానే నాలుగోదీ శిధిలావస్థకు చేరింది. పత్రికల, టీవీ చానళ్ల యాజమాన్యాల్లో అత్యధికులు అవినీతికీ, అక్రమాలకూ, సొంత లాభాలు పోగేసుకునే పనిలో కూరుకుపోయిన నేపథ్యంలో ఇప్పుడు విలేకరుల వ్యవస్థ కూడా అదే దోవపట్టింది. దేశం మొత్తం మీద ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మండలస్థాయిదాకా వ్యవస్థీకృతమయిన విలేకరులు నీతి నిజాయితీలను కట్టగట్టి బంగాళాఖాతంలో పాతరేశారు. నజరానాలు లేందే ప్రకటనలు పత్రికలకు ఎక్కటం అరుదయింది. కనీసం కలంతోపాటు తెల్లకాగితాల పుస్తకమన్నా ఇవ్వకపోతే కాగితం మీద కలం పెట్టలేని విలేకరి కూడా పాత్రికేయుల సమావేశానికి పోడంటే అతిశయోక్తి కాదు. అవినీతి పరాకాష్టకు చేరటంతో తమ విలేకరులను కూడా ఆయా సంస్థలే స్ట్రింగ్‌ ఆపరేషను నిర్వహించి పట్టుకోవలసిన దుర్గతి దాపురించింది. గతంలో టీవీ9లో రాజశేఖర్‌ పట్టుబడగా, శుక్రవారం ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలో నిర్వహించిన స్ట్రింగ్‌ ఆపరేషన్‌లో ఆ సంస్థ విలేకరితోపటు విశాలాంథ్ర, ఆంధ్రప్రభ కంట్రీబ్యూటర్లు కూడా చిక్కుకోవటం విశేషం. అయితే ఇది నిజంగా అక్రమాలను అరికట్టేందుకు జరిగిందా? లేక సదరు విలేకరిని బయటకు పంపేందుకు కుట్ర జరిగిందా? అన్నది తేలాలి. అక్రమ సంపాదనలో తిరుమల విలేకరులు ప్రథములు. వారి ఆదాయం నెలకు కనీసం లక్ష రూపాయలు అంటే దాన్లో ఆశ్చర్యపోవాల్సిన పనేలేదు. ఇటీవల పట్టుబడిన టీవీ 9 విలేకరి వీ. షణ్ముగాన్ని ఆ సంస్థ రాజీమార్గంగా తొలగించింది. టీటీడీ అతనిపై కేసు పెడితే తమ సంస్థ పరువు పోతుందన్న భయంతో టీవీ 9 యాజమాన్యం ఇద్దరు జర్నలిస్టుల సంఘం నాయకుల సహాయంతో అతనిని తొలగించే విధంగా రాజీచేసుకున్నారు. అయితే దొరికాడు కాబట్టి షణ్ముగం దొంగ. మిగతావారంతా దొరకని దొంగలు.

(లో)పాల కథ.

(లో)పాలు
ప్రైవేటు డెయిరీ ఏజంట్ల మాటేమోగానీ, హైదరాబాదు నగరంలో విజయ డెయిరీ ప్రతినిధులు మాత్రం వినియోగదారులతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. అధిక ధర వసూలు చేయటం, కోరిన ఎస్‌ఎన్‌ఎఫ్‌ పాలు లేవనటం, 200 మిల్లీ లీటర్ల ప్యాకింగ్‌ అడిగితే ఊరు పేరూ లేని డెయిరీవి ఇవ్వటం, అదేమని అడిగితే తిట్లకు దిగటం మామూలయింది. రాంనగర్‌ చౌరాస్తా ఏజంటు విజయడెయిరీతోపాటు అన్ని రకాల పాలూ విక్రయిస్తాడు. వాస్తవానికి ఇలా అన్ని రకాలూ అమ్మటం నిబంధనలకు విరుద్ధం. సరే చూసీచూడనట్లు పోదామనుకుంటే విజయ పాలకు బదులు వేరు రకం అంటగడుతుంటాడు. ప్రత్యేకించి 200 మిల్లీలీటర్ల విజయ డెయిరీ ప్యాకెట్లను దాచిపెట్టి సుగుణ పాలు అమ్మటం కద్దు. ఎవరయినా విజయపాలు కావాలని అడిగినా, లేవంటాడు. చూసి అడిగితే వాటిని దుకాణాల వాళ్లకోసం తెప్పించానని తప్పుకోజూస్తాడు. విజయపాల ప్యాకెట్లు పగిలిపోతున్నందున తెప్పించటం లేదంటాడు. దీనికితోడు రూ. 4.50కు బదులు రూ. 5 వసూలు చేస్తాడు. అడిగితే చిల్లర లేదంటాడు. గట్టిగా అడిగితే చిల్లర తెచ్చుకుని తీసుకుపొమ్మంటాడు. అదే ఇతర డెయిరీల 200 మిల్లీలీటర్ల పాలకు మాత్రం రూ. 5.50 తీసుకుని చిల్లర ఇస్తాడు. ఇదంతా విజయ డెయిరీ యాజమాన్యం అనుసరిస్తోన్న దివాలాకోరు విధానాల ఫలితంగానే ఇలా జరుగుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవటం, అక్రమార్కుల నుంచి సొంత లబ్ధి పొంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నందునే వినియోగదారుల మన్నన పుష్యలంగా ూన్న ప్రభుత్వ సంస్థ ఇలా ఏడుస్తోంది. కూర్చున్న కొమ్మను నరుక్కోవటమంటే ఇదేనన్న జ్ఞానం విజయ డెయిరీ సిబ్బందికి ూంటే పరిస్థితి ఇలా ూండదు. ఎవరన్నా ధైర్యం చేసి ఫిర్యాదు చేసినా, చర్య తీసుకోకపోగా ఫలానావాడు మీ మీద ఆరోపణలు చేస్తున్నాడని ఏజంట్లకే ూప్పందిస్తారు. దీంతో ఆ ఏజంటు ఆ వినియోగదారుడిని ఏదో ఒకటి ఆధారం చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తాడు. చిల్లరలేదంటాడు ఒకసారి, స్టాకు లేదంటాడుద మరోరోజు, అవసరమయి అడిగితే రోజూకన్నా ఎక్కువ పాలు ఇవ్వనంటూ పేచీలకు దిగుతాడు. ఇదీ విజయ డెయిరీ (లో)పాల కథ.