- గుళ్లూ గోపురాల చుట్టూ ఎడ్యూరప్ప ప్రదక్షిణలు
- రూ.1.6 కోట్ల ప్రజా ధనం వృథా
దేవుడే రక్షిస్తాడు! ఇది కర్నాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప నమ్మకం. తనకు సమస్యలు ఎదురైనప్పుడు, ఎదురవుతున్నట్లు కనిపించినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న గుళ్లూగోపురాల చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభిస్తారు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎడూరప్ప నమ్మకానికి అంతే లేకుండా పోయింది. తన ప్రభుత్వానికి పొంచి వున్న ముప్పును తప్పించాలంటూ గుళ్లూ గోపురాల చుట్టూ ప్రదక్షిణలు చేపట్టారు. అదీ ఒకట్రెండు గుడులనుకుంటే పొరపాటే. కేవలం 15 రోజుల వ్యవధిలో 32 గుళ్లను దర్శించి ‘చరిత్ర’ సృష్టించారు. ఇలా దర్శించిన గుళ్లలో జమ్మూకాశ్మీర్లోని వైష్ణోదేవీ మందిరం కూడా ఉంది. తమిళనాడులో ఏడు, కేరళలో మూడు, దక్షిణ కర్నాటకలో ఆరు, బెంగళూరు, తన సొంత పట్టణం షిమోగాలో మూడేసి గుడులను ఆయన దర్శించారు. ఒకవైపు గుళ్ల చుట్టూ తిరుగుతూనే హోమాలు కూడా నిర్వహించారు. ఇలా తన వ్యక్తిగత భక్తి విశ్వాసాలకు వినియోగించిన ధనం మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్చయింది.
పర్యటనలకు ప్రభుత్వ హెలికాప్టరే వినియోగించుకున్నారు. ఈ విధంగా రూ.1,58,24,700 ప్రభుత్వ ధనం ఖర్చయినట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆయన కేబినెట్లోని ‘విశ్వాసపాత్రులైన’ మంత్రులది కూడా ఇదే దారి. దక్షిణ భారత్లోని కొన్ని ప్రముఖ ను వారు దర్శించారు. ఎడ్యూరప్ప సన్నిహితురాలు, విద్యుత్ శాఖ మంత్రి శోభా కరందాజ్లే అయితే మరో అడుగు ముందుకేశారు. ఎడ్యూరప్ప పీఠాన్ని కాపాలంటూ వారం రోజులపాటు ఉపవాస ప్రార్థనలు చేపట్టారు. ఆమె కేవలం కొన్ని పళ్లు, నీరు మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్ సహచరుల తీరు ఈ విధంగా ఉంటే, ఎడ్యూరప్పకు గట్టి మద్దతిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త కూడా ఇలాంటి పూజలకే పది లక్షలు ఖర్చు పెట్టారు. ఎడ్యూరప్ప జాతక చక్రాన్ని బట్టి దోష నివారణ పూజలు చేయించారు.