రెచ్చగొట్టబడిన జనానికి ఇంగిత జ్ఞానం తక్కువ. అలాంటి వాళ్లు లక్ష్యం లేకుండా విడిచిన బాణాల్లాంటివాళ్లు. ఎదుటివాళ్లను చంపమంటూ రెచ్చిగొట్టినవాళ్లు కూడా వారి చేతుల్లో చచ్చే ప్రమాదం ఉంది. అంతటి ప్రమాదాన్ని రాష్ట్రంలో కాంగ్రెసు పెంచి పోషిస్తోంది. పాలకులుగా తమ తప్పిదాలు ప్రజలు గుర్తించకుండా వారిని దారి తప్పించటం కాంగ్రెసుకు వెన్నతో పెట్టిన విద్య. ఆ మాటకొస్తే పాలకుల లక్షణాల్లో అదొకటనుకోండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి కారణమయిన కాంగ్రెసు, అసలు కారణాలను ప్రజలు గుర్తించకుండా వాళ్లూ అందులో భాగస్వాములవుతున్నట్లు నటించటం కాంగ్రెసు నీతి – రీతి. మిలియన్ మార్చ్ పేరిట తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి గురువారం (10 మార్చి 2011) హైదరాబాదులో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఇదే తీరు వెల్లడయింది. రెచ్చిపోయిన జనం తొలుత కాంగ్రెసు నాయకులకు ఘనంగా సన్మానించారు. తర్వాత సహజంగానే దారి తప్పి వ్యవహరించారు. కందుకూరి వీరేశలింగం, శ్రీశ్రీ, పింగళి వెంకయ్య, శ్రీకృష్ణదేవరాయలు, త్రిపురనేని రామస్వామి చౌదరి, మొల్ల, ఎర్రాప్రెగ్గడ, అన్నమయ్యలకు కూడా ప్రాంతీయం అంటగట్టి ట్యాంక్బండ్ మీదున్న వారి విగ్రహాల ధ్వంసానికి పూనుకున్నారు. అంతటితో పోనీయలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి సంస్థల యాజమానులు కోస్తావాసులంటూ ఆ సంస్థలకు చెందిన ఓబీ వ్యాన్లను తగలబెట్టారు. విలేకరుల కెమెరాలను ధ్వంసం చేశారు. ఆంధ్రబ్యాంకు ఏటీఎంపై కూడా దాడి చేశారు. తర్వాత సహజంగానే పోలీసులతోనూ తలపడ్డారు. ఇదంతా అనుకోకుండా రెచ్చిపోయిన యువకుల కార్యకలాపాలు కావు. రోజుల తరబడీ రెచ్చగొట్టబడినవారి సహజమయిన చేష్టలు. విగ్రహాల ధ్వంస రచననూ, మీడియాపై దాడినీ వ్యతిరేకించేవారు చేయవలసింది ఆ పనులు చేసిన వారిని కాదు. ఆ పని చేయించేందుకు పురిగొల్పిన అంశాలు ఏమిటని ఎంచి చూడాలి. పురిగొల్పిన వారిని వెలికితీసి వారి రీతినీ, నీతినీ ప్రజల ముందుంచాలి. దీనికి మీడియానే ప్రధానంగా పూనుకోవాలి. ఈ వ్యవహారం ఒక్కసారితోనో, ఒకరోజులోనో పూర్తయ్యేది కాదు. సుదీర్ఘంగా సాగించవలసిన కార్యక్రమం.
10 మార్చి
Posted by ramakrishna on మార్చి 11, 2011 at 3:09 సా.
prati teluguvaadoo sigguto taladimchukovaalsina heyamyna charya idi. mana home minister garu dvamsa priyulanu mana biddalu ani sambhodisthunnaaru. baadhagaa undi.
Posted by ss on మే 15, 2011 at 1:00 సా.
baga siggu padandi.