ఓ డజను రోజులపాటు తెలంగాణలో బడులకు వేసిన బలవంతపు తాళాలు 2011 అక్టోబరు 18 నుంచీ ఊడనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రాంత ప్రైవేటు పాఠశాలల యజమానుల సంఘం 17వ తేదీ సాయంత్రం ప్రకటించింది. వాస్తవానికి ఈ ప్రకటన రానున్న విషయాన్ని తెలుగిల్లు 15వ తేదీనే విశ్లేషించిన వైనం చదువరులకు విదితమే. ఏదయితేనేం బడులు తెరుచుకోవటం తల్లిదండ్రుల ఉద్యమ ఫలితమే. అందుకు తెలుగిల్లు తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుతోంది. ఇదేదో తెలంగాణ వ్యతిరేక వ్యవహారం కాదు సుమా. ఉమ్మడిగా గొంతు విప్పితే వచ్చే లాభం ఏమిటో తెలియజెప్పేందుకే. ఈ విజయం మరిన్ని పోరాటాలకు దారి తీయాలని తెలుగిల్లు ఆశిస్తోంది. గ్యాస్ ధర పెరుగుదల, విద్యుత్తు భారాలు, నిరుద్యోగం, నిలిచిపోయిన నీటి సరఫరా, బడి మూత, పంతుళ్ల కొరత, రోడ్డుపై చెత్తాచెదారం, పన్నుల పెంపు, లంచాలు, అక్రమాలు ఇలా … ఇలా సమస్య ఏదయినా వీలయిన వాళ్లంతా ఉమ్మడిగా కదలాలి. ఒక్కటై గళం విప్పాలి. అప్పుడు విజయాలు ఒళ్లో వచ్చి వాలతాయి.
17 అక్టో
Posted by Praveen Sarma on అక్టోబర్ 17, 2011 at 1:14 సా.
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కంటే ఒక సంవత్సరం విద్యా కాలం ముఖ్యమా?
Posted by తెలుగిల్లు on అక్టోబర్ 17, 2011 at 1:22 సా.
పండిత ప్రవీణ శర్మకు అవసరం లేదు. కానీ అప్రవీణులయిన బుడుగులకీ, సీగాన పెసూనంబలకూ ఎంతో ఎంతో అవసరం
Posted by AswaGhosh on అక్టోబర్ 17, 2011 at 1:31 సా.
Well Said. For School drop-outs, running internet cafes it hardly matters.
:-))
Posted by Praveen Sarma on అక్టోబర్ 17, 2011 at 1:31 సా.
పిల్లల చదువులని ఒక ఏడాది వాయిదా వెయ్యడానికే బద్దకమా?
Posted by AswaGhosh on అక్టోబర్ 17, 2011 at 1:32 సా.
You close your shop and join Telangana moverment, idiot.
Posted by Rajeswar on అక్టోబర్ 17, 2011 at 1:34 సా.
It is not your marriage, to postpone indefinetly. Only educated know importance of education, buffoon.
Posted by తెలుగిల్లు on అక్టోబర్ 17, 2011 at 3:48 సా.
అయ్యా పండితుల వారూ, వాయిదా వేయటమే బద్దకం, బడికి వెళ్ళటం కష్టం
Posted by భీష్ముడు on అక్టోబర్ 17, 2011 at 2:35 సా.
శిఖండి వున్న చోటికి భీష్ముడు రాడు.
Posted by తాడిగడప శ్యామలరావు on అక్టోబర్ 17, 2011 at 5:16 సా.
క్షమించండి.
తిట్టుకోకుండా చర్చించుకోలేరా?
ఎవరు ఒప్పు యెవరు తప్పు అనేది వేరే విషయం.
పరస్పరదూషణల వలన ఇరువురి గౌరవమూ పలుచనౌతున్నది.
వాగ్భూషణం భూషణం అని గ్రహిస్తే సంతోషం.
Posted by సూటిగా > on అక్టోబర్ 17, 2011 at 5:17 సా.
పంది కి ఏమి తెలుసు పన్నీరు వాసన – టొపీ పెట్టుకున్న గాడిద కేమి తెలుసు చదువు విలువ.
Posted by Wah on అక్టోబర్ 18, 2011 at 12:24 ఉద.
Wah! Wah!
Posted by Praveen Sarma on అక్టోబర్ 18, 2011 at 12:51 ఉద.
డబ్బైనా, వస్తువైనా మనిషి చేతిలో ఉన్నప్పుడే నిజమైన అనుభూతి. కోస్తా ఆంధ్రలో ఉంటున్న పేదవాళ్ళు తమ చేతిలో లేని & ఎక్కడో వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ కోసం తెలంగాణా ప్రజల మీద ద్వేషం పెట్టుకుంటారని అనుకుంటే అనుభూతి అనేది ఎందుకో తెలియకుండా పోతుంది. మార్క్సిజం నిజంగా అర్థమైనవాళ్ళందరికీ అనుభూతి అంటే ఏమిటో తెలుసు. అనుభూతికి బయట ఉండే సబ్జెక్టివ్స్కి మనిషి అంత ప్రాధాన్యం ఇస్తాడనుకుంటే మీకు అనుభూతి గురించి అర్థం కాదు.
Posted by Praveen Sarma on అక్టోబర్ 18, 2011 at 12:54 ఉద.
https://telugillu.wordpress.com/2011/10/17/%e0%b0%b8%e0%b0%ae%e0%b1%88%e0%b0%95%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%b5%e0%b0%be%e0%b0%a6%e0%b0%82-%e0%b0%b2%e0%b1%87%e0%b0%a6%e0%b0%a8%e0%b0%9f%e0%b0%82/#comment-1045 ఇక్కడ సుబారావు గారు మార్క్సిజం పేరు చెప్పి తనని జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తే నేను సమాధానం వ్రాసాను. జస్టిఫికేషన్ కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటారు కదా మనవాళ్ళు.