Archive for డిసెంబర్ 10th, 2011

పంజాబ్‌లో మూడో ఫ్రంట్‌

పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌కు దగ్గర బంధువు, ఆ రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌ బాదల్‌ పాలక శిరోమణి అకాలీదళ్‌ నుంచి విడిపోయి పంజాబ్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి) ని ఏర్పాటు చేశారు.   తాను అకాలీదళ్‌, కాంగ్రెస్‌ పార్టీలకు భిన్నమైన విధానాలను అనుసరిస్తానని మన్‌ప్రీత్‌ సింగ్‌ స్పష్టం చేశారు. పంజాబ్‌ రాజకీయాలు బాదల్‌ నేతృత్వంలోని అకాలీదళ్‌, కాంగ్రెస్‌ చుట్టూ తిరుగుతూన్నాయి. ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా  వామపక్షాలను కలుపుకుని రాష్ట్రంలో మూడో ఫ్రంట్‌ను నిర్మించేందుకు పిపిపి కృషి చేస్తున్నది. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి గట్టి పోటీ ఇచ్చే అవకావముంది. పంజాబ్‌లో రాజకీయాలు, ప్రత్యామ్నాయ కూటమి ఆవశ్యకత గురించి ది వీక్‌ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో మన్‌ప్రీత్‌ సింగ్‌ విపులంగా విశ్లేషించారు. ఆ విశేషాలు….

పంజాబ్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి) ఏర్పాటుకు మిమ్మల్ని పురిగొల్పిన అంశమేమిటి?

గత నలబై ఏళ్లలో పంజాబ్‌ అన్నింటా తిరోగమనంలో ఉండడం నన్ను తీవ్రంగా కలచివేస్తున్నది. విద్య, ఉపాధి, గడచిన 15-20 ఏళ్లలో పేదరిక నిర్మూలన తీరుతెన్నులను ఒక్కసారి పరికించినట్లైతే మీకే తెలుస్తుంది. స్వాతంత్య్రం వచ్చి 64 ఏళ్లు గడచినా భారత్‌ కానీ, పంజాబ్‌ కానీ ఆశించిన స్థితికి చేరుకోలేకపోయాయి. భారత దేశానికే తలమానికంగా ఉండాల్సిన పంజాబ్‌ నేడు ఈ స్థితికి దిగజారడానికి కారణమెవరు? 500 ఏళ్ల చరిత్ర మాపై ఉంచిన బాధ్యతల బరువును మోయడానికి ఎన్నడూ వెనుకాడను, సవాల్‌ను చూసి బెదిరిపోయి కాడిని కింద పడేయడం మా తరానికి అసలు నచ్చదు.

ర్యాలీల్లో ప్రజలకు మీరెటువంటి సందేశాన్ని ఇవ్వదలచుకున్నారు?

పంజాబ్‌ అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడాలి…అవసరమైతే ఉప్పు కారంతో సంగం రొట్టెతోనే గడపాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. సంపాదించడానికి మరింత కష్టపడాలి. అప్పుడు పేద – ధనికుల మధ్య అంతరాలను చెరిపేయాలి. ఈ విషయాల్నే పంజాబ్‌ పీపుల్స్‌ పార్టీ ప్రజలకు తెలియజెప్తుంది. వారు చెప్పాలనుకునేది వినడం కాదు, మేము చెప్పేదేమిటో వారు వినాలి.

పిపిపి రాజకీయ వ్యూహం ఏమిటి?

గల్లిపోలి పోరాటంలో ముస్తఫా కమల్‌ టర్కిష్‌ ప్రతిష్టను ఇనుమడింపజేయడమే ధ్యేయంగా ముందుకుసాగాడు. విజయం సాధించాడు. అతని వ్యూహాన్నే నేను అనుసరిస్తున్నాను. ప్రపంచమంతటా రాణిస్తున్న పంజాబీలు ఇక్కడే ఎందుకు రాణించలేకపోతున్నారు? మన పాఠశాల విద్య కుప్పకూలిపోయింది. ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రం బయటపడడానికి నా దృష్టిలో 12 -15 ఏళ్లు పట్టవచ్చు. పేదరిక తాకిడి 7శాతందాకా ఉన్నది. పంజాబీల్లో చాలా మందిది తుదిదాక పోరాడేతత్వం. వారిలో నిద్రాణంగా ఉన్న ఆత్మస్థయిర్యాన్ని రగుల్కొల్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను.

మీరు ఎదుర్కొంటున్న సవాల్‌ ఏమిటి?

ఫ్యూడల్‌ మనస్తత్వాన్ని మనం పారదోలాల్సిన అవసరముంది. ఏ సమాజానికైనా న్యాయం చట్టం కలిగివుండడమనేది అత్యంతావశ్యకం. పంజాబ్‌లో నేడు అదే కొరవడింది. పోలీస్‌ సంస్కరణలు పిపిపి ఎజెండాలో మొట్టమొదటి అంశంగా ఉంటుంది. అధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా పంజాబ్‌ ఉన్నా పారిశ్రామి కీకరణకు నోచుకోలేదు. వీటితోబాటు అవినీతిని అరికట్టడంపైన , విద్యపైన దృష్టి పెడతాము. ఇవే పిపిపి ఎన్నికల ఎజెండాల్లో ముఖ్యమైన మైలురాళ్లుగా ఉంటాయి. వీటిని సాధించడం కష్టంతో కూడుకున్న పనే కావచ్చు. కానీ, అసాధ్యమేమీ కాదు. మాకు జనంలో స్పందన కూడా బాగుంది. పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. అరబ్‌ ప్రజల్లో చైతన్యం ప్రభావం మన ఉపఖండం మీద కూడా ఉంటుంది. ఇది నా గురించి చెబుతున్నది కాదు. సూత్రబద్ధమైన విధానాలు, అభివృద్ధి, సౌభాగ్యం కోసం ప్రజల్లో పెరుగుతున్న ఆకాంక్ష నుంచి ఇది వస్తున్నది. పంజాబ్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నారు.

మీరు కూడా బాదల్‌యే కదా. అలాంటప్పుడు పిపిపిని అకాలీ దళ్‌ చీలిక గ్రూపుగా భావించవచ్చా?/font>

మాది చీలిక గ్రూపు కాదు. అకాలీదళ్‌, దాని ధోరణులు మా ప్రణాళికలో మచ్చుకు కూడా కానరావు. ఏడు మాసాల యవ్వనం గల పిపిపి లౌకికవాద జాతీయపార్టీ. సిపిఐ(ఎం), సిపిఐతో కలిసి సమాజ్‌ మోర్చాను ఏర్పాటుచేశాం. మా కనీస ఉమ్మడి కార్యక్రమ ఆవిష్కరణకు ప్రకాశ్‌కరత్‌, ఎబి బర్దన్‌ వస్తున్నారు. అదే సమయంలో ఏ పార్టీకి ఆ పార్టీ సొంత మ్యానిఫెస్టోలను కలిగివుంటాయి.

మీ పార్టీ సభ్యులు ఏయే తరగతులనుంచి ఎక్కువగా వస్తున్నారు?

పిపిపి సభ్యుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనుంచి, తరగతుల నుంచి వచ్చినవారు ఉన్నారు. పార్టీకి యువత వెన్నెముకలా నిలుస్తున్నది. మా పార్టీకి 40 శాతం మద్దతు వీరినుంచే వస్తున్నది. అభ్యర్థుల ఎంపికలో మేము ఉన్నత ప్రమాణాలను పాటిస్తాము. చాలా వరకు కొత్త ముఖాలే ఉంటాయి. మా విధానం, ఎజెండాతో అంగీకరించినవారే ఇందులో చేరతారు. యువతకు రాజకీయంలో రాటుదేలిన అనుభం లేకపోవచ్చు కానీ, వారు మంచి పౌర ప్రతినిధులు. నేతాజి సుభాష్‌ చంద్రబోస్‌కు అత్యంత సన్నిహితుడి మనుమడు, ఆక్స్‌ఫర్డ్‌లో పిహెచ్‌డి చేసిన వ్యక్తి లండన్‌ నుంచి తిరిగి వచ్చి పార్టీ కోసం పూర్తి కాలం పనిచేయడానికి సిద్ధపడ్డాడు. అతనికి మేము టికెట్‌ ఇచ్చాము. ఇటువంటి ప్రతిభ ఉన్నవారిని, వారి మద్దతును పొందేందుకు మేము ప్రయత్నిస్తున్నాము.

వామపక్షాలతో మీ సీట్లసర్దుబాటు ఎలా ఉండబోతుంది?

మొత్తం సీట్లలో 15శాతం సీట్లలో వామపక్షాలు పోటీ చేస్తాయి. మిగతా స్థానాల్లో పిపిపి తన అభ్యర్థులను బరిలోకి దింపుతుంది.

ఈ ఎన్నికల నుంచి మీరెటువంటి ఫలితాన్ని ఆశిస్తున్నారు?

ఫలితాలు ఎలా ఉండబోతున్నదీ నాకు తెలియదు. ప్రజలు ఈ రెండు పార్టీలు (అకాలీదళ్‌, కాంగ్రెస్‌ ) నుంచి మార్పు కోరుకుంటున్నారనే భావం నాకు కలుగుతోంది.

లోక్‌చెత్త – సంచిక … 2


లొక్ సత్తా కాదు లొక్ చెత్త శీర్షికతో తొమ్మిదో తేదీన రాసిన అంశాన్నిసమయాభావం – విస్తృతి అవుతుందన్న జ్ఞానంతోపాటు ఆవలింతలు – కునికిపాట్లు మధ్య చెత్తన0తా ఎత్తి పారబోయలేకపోయాను. అందుకని ఈ రెండో సంచికను సమర్పించాల్సి వస్తోంది. కాసింత పెద్ద మనసు చేసుకుని అంగీకరించండేం!
గతం గత: అనుకున్నా లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ ఇటీవల చేసేసిన తీర్మానాలు ఆయన వ్యక్తిగత నిజాయితీ పట్ల కూడా అనుమానాలు రేకిత్తిస్తున్నాయి.
అందులో ముఖ్యమైనది విదేశీ ప్రతక్ష్యపెట్టుబడులకు జెపి అనుకూలంగా గొంతెత్తటం. ఏ విషయంలోనయినా ఆయన తన సొంత గొంతుకను విన్పించే హక్కు ఉంది. కొందరు అపోహపడుతున్నట్లుగా సొంత అభిప్రాయం కలిగి ఉండే హక్కు విషయంలోనూ, అభిప్రాయాన్ని నిర్భయంగా వెల్లడించే హక్కు విషయంలోనూ నేను అభ్యంతరం వ్యక్తం చేయటం లేదు సుమా! నా వ్యతిరేకతల్లా కేవలం ఆయన సూత్రీకరణలతోనే అని విజ్ఞులు గమనిస్తారని ఆశిస్తాను. సరే, అసలు విషయానికి వద్దాం. అయనంటారూ, (పదాలు ఆయనవి కాదు, విషయం మాత్రమే) ”దుకాణం ఎవడు తెరిస్తే నాకెందుకండీ! నా రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుంది కాబట్టి నేను వాల్‌మార్ట్‌కు స్వాగతం పలుకుతాను.”
సరే, ఎఫ్‌డిఐ రాకతో ఐదు కోట్ల మంది చిన్నాచితక దుకాణదారులు వీధుల పాలయ్యే ప్రమాదాన్ని పక్కనబెట్టి రైతుల సంగతే చూద్దాం. (నేనూ రెండెకరాల రైతునే నండోయ్‌!) ఆయన చెప్పినట్లుగా ఎక్కడయినా వాల్‌మార్ట్‌గానీ, అలాంటి బహుళజాతి కిరాణా గొలుసు దుకాణంగానీ రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఈ తరహా దగుల్బాజీ కొడుకులు తమ లాభాలను వదులుకుని రైతుకు ఏ దేశంలో సాయపడ్డారో జేపీ కాసింత చెబుతారా? చూపిస్తారా? వాల్‌మార్ట్‌గానీ, ఇంకోకడుగానీ ఇతర దేశాల నుంచి తక్కువ ధరకు వచ్చే సరుకుల్ని కాకుండా మన రైతన్నకు ఎక్కువ ధర ఇచ్చి కొంటాడా? ఎందుకు కొంటాడో జేపీ చెప్పగలరా? వాళ్లంతా తెలివితక్కువ కొడుకులా? అమాయకులా? లేదా మన రైతుల పట్ల వారికి అపారమైన ప్రేమ ఏమయినా కారిపోతుందా?? వాళ్లనూ, వాళ్లకు తాన తందాన పాడే మీ లాంటి వాళ్లనూ మేము నమ్మితే పుట్టి మునగటం ఖాయం. అమెరికాకే చెందిన వాల్‌మార్ట్‌కు వ్యతిరేకంగా ప్రపంచ ప్రజల భావాలను సమీకరిస్తున్న వేడ్‌ రాధ్కె ఏమంటున్నారో చూడండి – ”చవకగా దొరికే సరుకుల్ని చైనాలో కొని భారతదేశానికి తరలించే అవకాశం ఉంది. అ పనిలోనే చైనాలో వాల్‌మార్ట్‌ ఇప్పటికే 1200 కోట్ల డాలర్ల విలువయిన సరుకుల్ని సేకరించింది. అదే భారతదేశంలో కేవలం 200 కోట్ల డాలర్ల విలువయిన సరుకుల్ని మాత్రమే కొనుగోలు చేసింది.” ఇప్పుడయినా నమ్ముతారా? వాల్‌మార్ట్‌ వచ్చినా వాడెమ్మ విదేశీ మొగుడు ఎవడొచ్చినా మన బొచ్చెలో పడేది విదేశీ సరుకేనని. అంతెందుకు – వాల్‌మార్ట్‌గాడు ఏమి చేస్తున్నాడంటే అమెరికాలో తగినంత సరుకు రాసులు పోసి ఉన్నా ఫిలిప్సీన్స్‌లో తక్కువ ధరకు దొరుకుతున్నాయని యాపిల్‌ పండ్లనూ, మెక్సికో నుంచి బత్తాయిలనూ తీసుకువచ్చి అక్కడి రైతులను నట్టేట ముంచుతుంది. పాశ్యాత్య దేశాల పాలకులు ఓట్ల కోసం ధనిక రైతులకు నూరు శాతం రాయితీలు కూడా కల్పిస్తోన్న నేపథ్యంలో ఆయా దేశాల కన్నా మన ధరలు అధికంగా ఉండటం సహజం. అసలే అరకొర రాయితీలు అవీ సక్రమంగా అందని సమస్య ఉన్న మన దేశంలో ధరల వ్యత్యాసం కారణంగా మన రైతుల నుంచి ఏ ఒక్కటీ కొనేందుకు వాల్‌మార్ట్‌ ఒప్పుకోదుకాక ఒప్పుకోదు.
ఇక చిన్న దుకాణదారుల పరిస్థితి కూడా దారుణం అవుతుంది. కిరాణా వ్యాపారంలో విదేశీ ప్రతక్ష పెట్టుబడుల కారణంగా థాయ్‌ల్యాండ్‌లో 60 వేల చిన్న దుకాణదారులు దివాలా తీశారని ఆ దేశ ప్రభుత్వం స్వయంగా ప్రకటించటం పరిశీలనార్హం. దానికి భిన్నంగా భారతదేశంలో బడుగులకు వాల్‌మార్ట్‌  స్నేహ హస్తం అందజేస్తుందంటూ మనల్ని కూడా నమ్మమంటున్నారు జెపి.