టీవీ – 9 పక్క చూపులు


ప్రపంచంలో బోలెడు బోలెడు సమస్యలు. ఏళ్లూ పూళ్లూ గడుస్తున్నా పరిష్కారం కాక ఈతి బాధలు. నాలుగేళ్లుగా ప్రపంచాన్ని ఆవరించిన ఆర్థిక మాంద్యం – ఇప్పుడు కరువు. అమెరికా, జపాను, చైనా తదితర దేశాల్లో తుపాన్లు, వరదలు. వీటన్నింటి ఫలితంగా లక్షల సంఖ్యలో ఊడిపోతున్న ఉద్యోగాలు. ఆ కారణంగా కోపతాపాలు… తుపాకి కాల్పులు. అసలు వాళ్లు కాకుండా అమాయకులు బలి.
ఇక దేశం సంగతి సరేసరి. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల్ని రాసి నేలమీద పరిస్తే ఆమడ దూరానికి ఒక్క అంగుళం కూడా తక్కువగా ఉండదు.
– రెస్పిరేటర్లు తదితర కనీస అవసరాలు లేక ఆసుపత్రుల్లో పిట్టల్లా రాలిపోతోన్న పసికందులు.
– ప్రాణం పోతే దానికి బాధ్యతంతా వైద్యులదేనన్నట్లుగా వారిపై బాధితుల దాడులు.
– దోమల విజృంభణ … జ్వరాలతో మంచం పట్టిన గ్రామాలు, గిరిజన గూడేలు.
– కరువు, అరకొరగా సాగు.
– కనీసం మూడు గంటల మొదలు 15 గంటలదాకా రోజూ విద్యుత్తు కోత.
– బీటీ పత్తిని ఆవరించిన లద్దె పురుగు
– దొరకని ఎరువులు, చేతబడని రుణాలు, కాలుతోన్న మోటార్లు, తప్పని విద్యుదాఘాతాలు.
– ఆకాశాన్నంటుతోన్న నిత్యావసరాలు ా బియ్యం రూ. 40, సెనగపప్పు రూ. 100, కందిపప్పు రూ. 80, అరటి కాయలు రూ. 40, ఆపిలు రూ. 30.
– ఫీజు చెల్లింపు వ్యవహారంలో అయోమయం.
– ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం ఉంటుందో ఊడుతుందో తెలీని దుస్థితి. ఫలితంగా రాష్ట్రంలో అసలు పాలన ఉందో? లేదో?? ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి
అయితే గియితే ….
ఈ సమస్యల్ని పైపైన తడుముతోన్న మీడియా ా దేనికీ కొరగాని విషయాను చర్చించేందుకు మాత్రం గంటలకు గంటల మేర సమయాన్ని ఖూనీ చేస్తోంది.
అందులోనూ టీవీ – 9 దే అగ్రస్థానం.
ఆదివారంనాడు ప్రసారమవుతుండగా మధ్యలో కొద్దిసేపు చూసి, పూర్తిగా చూడలేక మధ్యలోనే కట్టేసిన ఓ కార్యక్రమం ఈ రాతకు స్ఫూర్తి.
పాండవుల పద్మవ్యూహానికి సంబంధించిన కార్యక్రమం ఇది.
హర్యానా రాష్ట్రంలో మనుషులు సాధారణంగా పోలేని కొండలు కోనల్లో ఉన్న పాండవుల పద్మవ్యూహ శిల్పం శిథిలమవుతున్నా దేశం పట్టించుకోవటం లేదట!
అది ఘోరం ! నేరం!! అంటూ నాటకీయ వ్యాఖ్యానాలు.
సమర్పించిన టీవీ యాజమాన్యం మాటేమోగానీ ఈ కార్యక్రమానికి యాంకరింగ్‌ చేసిన దీప్తీ వాజ్‌పేయి మాత్రం తెగ తెగ బాధపడిపోయింది. వాయిస్‌ ఓవరీశుడు కూడా గొప్పగా నటించాడు లెండి.
విషయానికొస్తే భారత యుద్ధానికి ముందు కాలంలో పాండవులు ఇక్కడ చేరి శిక్షణ పొందారట. అందులోనూ పద్మవ్యూహం పన్ని కౌరవుల్ని దుంపనాశనం చేసే లక్ష్యంతో రోజూ తెగ కష్టపడిపోయారట. శిక్షణ కోసం పద్మవ్యూహాన్ని కొండ శిలను చెక్కి రూపమిచ్చారట. వేల సంవత్సరాలు గడిచినా పాండవులు చెక్కించిన ఆ శిల్పం నిలిచి ఉండటం అద్భుతమట. అయితే ఆ శిల రూపం కోల్పోతున్నా దేశానికి ఏ మాత్రం పట్టకపోవటం క్షంతవ్యం కాదట. ఇలా ఇలా సాగింది. టీవీ – 9 కన్నీటి గాథ.
ఆ సమయాన్ని రాష్ట్ర ప్రజలు అనుభవిస్తోన్న ఈతి బాధలు ఏమిటో? దానికి కారణం ఏమిటో? పరిష్కారానికి మార్గం ఏమిటో? చెప్పి ఉంటే….
ఔషద సంస్థలు, సెజ్‌ల యజమాని చేతిలో ఉన్న ఓ టీవీ ఛానలు ద్వారా నా కోరిక నెరవేరాలని కోరుకోవటం అతేనేమో!
అందులోనూ ఈ ఛానలు ఓ కార్పొరేట్‌ మీడియా సంస్థ చేతిలోకి పోయిందనీ, పోనున్నదన్న ప్రచారం కూడా జరుగుతోంది.
అందువలన నా కోరిక తీరే అవకాశం లేనేలేదు.
అన్నట్లు
ఈ కార్యక్రమం చూస్తున్నప్పుడు నాకు గుర్తుకొచ్చిన గురజాడ వారి వ్యాఖ్యలతో నా స్పందనను ముగిస్తాను.
”ఈ దేశంలో పాండవులు నివశించని గుహలూ లేవు – సీతమ్మ తానమాడని మడుగులూ లేవు”

ఈ ప్రశ్నలకు బదుళ్లేవి???
అన్నట్లు అన్నేళ్లూ పద్మవ్యూహ రచనలో కష్టపడి కూడా పాండవులు తీరా యుద్ధంలో ఎందుకని దానిని ఉపయోగించుకోలేదు?
పాండవులంతా శిక్షణ పొందితే, మరి కృష్ణార్జునలకు మాత్రమే పద్మవ్యూహ రహస్యాలు తెలియటం ఏమిటి?
ఏ శిక్షణా  లేకుండానే కౌరవులు పద్మవ్యూహాన్ని పన్నగా, పాండవులు ఏమీ చేయలేకపోవటం ఎందుకని?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: