తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి 10 మార్చి 2011 తేదీన నిర్వహించిన మిలియన్ మార్చ్ కార్యక్రమానికి తగుదునమ్మా అంటూ హాజరయిన కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, లోక్సభ నిజామాబాద్ సభ్యుడు మధుయాష్కీకి యువకులు తగిన శాస్తి చేశారు. ఏనుగు అంబారీమీద ఊరేగే రాజు లెక్కన తన కారెక్కి చేతులూపుకుంటూ ట్యాంకు బండకు వస్తోన్న కెకెపై తెలంగాణవాదులు దాడి చేశారు. చెప్పులు, నీళ్ల సీసాలను విసిరి నిరసన తెలిపారు. వెనక్కు పోవాలంటూ నినదిస్తున్నా అంబారీ దిగపోగా, చేతులతో విన్యాసాలు చేయటం తట్టుకోలేనికొందరు యువకులు కెకె వాహనాన్ని చుట్టుముట్టి ధ్వంసం చేశారు. అంతకంతకూ పెరుగుతోన్న నిరసనకారులనూ, వారి దాడికీ తట్టుకోలేక తొలుత చల్లగా వాహనం లోపలకు జారుకున్న కెకె అక్కడ నుంచి పలాయనం చిత్తగించాడు. బతుకు జీవుడా అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు. తెలంగాణ మంటల్లో చలిగాచుకుంటున్న మధుయాష్కీకి కూడా తెలంగాణవాదులు తగిన బుద్ధి చెప్పారు. ఆయనను పిడిగుద్దులతో సత్కరించారు. కోపం పట్టలేక కొందరు మీదపడి బట్టలు చించివేశారు. వెంటబడి తరిమారు. ఆ సమయంలో పోలీసులు తమ రక్షక్ వాహనంలో ఎక్కించుకుని తీసుకుపోయారు. తెలంగాణ వెనకబాటుకు ప్రధాన కారణమయిన కాంగ్రెసు నేతలు తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు వేసే నాటకాలను అందరూ కాకపోయినా కొందరయినా గుర్తించిన ఫలితమే కెకె, యాష్కీలకు జరిగిన శాస్తి. దీనికితోడు తెలంగాణ ఇవ్వాల్సింది కాంగ్రెసే అయినా దానిని పక్కనబెట్టి తామూ పోరాడుతున్నట్లు నాటకమాడుతోన్న నేతలకు పిడిగుద్దుల సన్మానం పూర్తిగా సమర్థనీయమే. పదవులు సహా ప్రజల సొమ్ములతో అన్ని సౌకర్యాలనూ అనుభవిస్తో అవసరానికి ‘జై బోలో తెలంగాణ’ పాట పాడుతోన్న నేతలకు వాస్తవానికి ఆ మాత్రం సన్మానం బహూ చిన్నది. తెలంగాణను నిజంగా కాంక్షించే నేతలయితే, ఇవ్వాల్సిన తమ అధినేతల్ని నిలదీయాలి. వారు కాదని తిరస్కరిస్తే, ఆ పార్టీకీ, తమ పదవులకూ రాజీనామా చేసి పోరాడాలి. ఈ ప్రభుద్ధులు తమ పదవుల్ని వదులుకోరు, తెలంగాణ ఇస్తారా? ఛస్తారా? అని ఏనాడూ నిలదీసిన పాపానపోరు. పైగా తెలంగాణ రాకుండా సీమాంధ్రులు కుట్రపన్నుతున్నారంటూ తరచూ వాగటం మాత్రం ఆపరు. తాము తెలంగాణ కోరుకున్నట్టే ఎదుటి వాళ్లు సమైక్యత కోరుకోవచ్చన్న ఇంగిత జ్ఞానం స్వయం ప్రకటిత నేతలకు లేదు. ప్రజల మనోభావాలు అంటూ తరచూ వాగే ఈ నేతలకు పెరిగే ధరలతో ఆ ప్రజలు పడే ఈతి బాధలు మాత్రం ఏనాడూ గుర్తుకురావు. తామూ, తమ పరివారం అవినీతి కారణంగా ప్రజలకు కనీస సౌకర్యాలు, ప్రభుత్వ పథకాలు, రాయితీలు అందటం లేదని తెలిసి కూడా కించిత్తు బాధపడరు. తమ కారణంగానే బాధలనుభవిస్తోన్న జనాలను వాస్తవమేదో ఆలోచించకుండా తప్పుదోవ పట్టించి సొమ్ముచేసుకుంటున్నారీ నేతలు. కొత్త రాష్ట్రంలోనూ తమ పెత్తనాలను కొనసాగించేందుకు ఎత్తుగడలు వేస్తోన్న నేతలందరికి కూడా కెకె, యాష్కీలకు జరిపిన సన్మానాన్నే తగురీతిన త్వరలో జరగాలని తెలుగిల్లు హృదయపూర్వకంగా కాంక్షిస్తోంది.
10 మార్చి
Posted by Snkr on మార్చి 10, 2011 at 12:21 సా.
Good job by Telabans. They may extend the same to Seemandhra congress politicians too, we support that.
Posted by subbarao on మార్చి 10, 2011 at 1:24 సా.
this shows failure of the ap govt.president rule is the only solution to control law and order.
Posted by subbarao on మార్చి 10, 2011 at 1:30 సా.
తెలుగు మీడీయా రేపంతా ప్రసారాలు బందు చేసి నిరసన తెలపాలి
Posted by ramakrishna on మార్చి 11, 2011 at 3:01 సా.
lagadapaatini tannaaru.. naagaanni tannaaru.. kk ni tannaaru.. yasheeni tannaaru.. kcr nu tannaboyaaru.. idi udyamamenantaaraa sir…