”నకిలీ విత్తనాలు అమ్మినవాడు ఇక ఎంతమాత్రమూ బయట ూండడు, వాళ్లు ఎంతటివాళ్లయినా కటకటాలు తప్పదు. చట్టాలఁ్నంటినీ కచ్చితంగా అమలుచేసి నకిలీ విత్తనాఁకి అవకాశం లేఁండా చేస్తాం. అక్రమాలను ఁయంత్రించేందుఁ అవసరమయితే పీడీ చట్టం పెట్టేందుఁ కూడా వెనకాడం.” – రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డితోపాటు ఇతర బాధ్యులు పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యాన సారాంశమిది.
అయితే రఘువీరారెడ్డి హAంకరింపులు అక్రమ వ్యాపారుల నకి’లీల’ ముందు పఁచేసిన పాపాన పోలేదు. రాష్ట్రంలో నకిలీ, కల్తీ విత్తనాల జోరు అడ్డేలేఁండా సాగుతోంది.
”ఆదిలోనే హంసపాదు” అన్నట్లుగా రాష్ట్ర రైతన్నఁ తొలిదశలోనే ఇక్కట్లు మొదలయ్యాయి. నకిలీ విత్తనం రైతుల్ని కాటేస్తోంది. గతంలో ఎన్నడూ లేఁవిధంగా నకిలీ విత్తనం కారణంగా ఓ రైతన్న బలవటమే ప్రస్తుత దుస్థితిఁ పట్టిచూపుతోంది. విత్తనాలు మొలవకపోవటంతో భవిష్యత్తును తలచుఁఁ ఆదిలాబాదు జిల్లా బజారత్నూర్ మండలం చిన్నబజారత్నూర్ఁ చెందిన గిరిజన రైతు మడావి మహాదు శఁవారం పురుగుమందు తాగి చఁపోయాడు.
మహబూబ్నగర్ రైతన్నది మహావిషాదం
మహబూబ్నగర్ జిల్లా గద్వాల ప్రాంత పత్తి విత్తన రైతుల మహా విషాదం ప్రజాశక్తి పాఠఁలఁ విదితమే. నకలీ విత్తనాల కారణంగా రూ. 120 కోట్ల పెట్టుబడి దళారులపాలయింది. పంట చేతికొచ్చి ూంటే కనీసం 30 కోట్ల రూపాయలు రైతులఁ దక్కి ూండేవఁ లెక్కలు విఁ్పస్తున్నాయి. 12 వేల ఎకరాల్లో విత్తిన విత్తన పత్తి పుప్పొడి లేఁండానే పుష్పించటంతో అసలుకే ఎసరొచ్చింది. లక్ష రూపాయల నుంచి లక్షన్నర రూపాయలదాకా పెట్టుబడి పెట్టిన ఆరువేల రైతు ఁటుంబాలు ఇప్పుడు వీధినపడబోతున్నాయి. రైతులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నా అదే ప్రాంతాఁకి చెందిన మంత్రి డికె ఆరుణ సమస్య పరిష్కారాఁకి పూనుఁన్న దాఖలాలు లేవు. సరికదా, తమను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి రోశయ్యను శక్రవారం రైతన్నలు కలిసి మొరపెట్టుఁన్న సమయంలో అక్కడే ఉన్న మంత్రి బాధితులనే తప్పుపట్టటం విమర్శలఁ తావిచ్చింది. విత్తన పంపిణీదారులంతా ఆమె అనుయాయులే కావటంతో మంత్రి తమ సమస్యను పక్కదోవ పట్టిస్తోందఁ రైతులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒకరేమో నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారుల పట్ల ఉపేక్షించబోమఁ పదేపదే ప్రకటనలు చేస్తుండగా, మరొకరు ప్రత్యక్ష్యంగానే అక్రమార్కులను వెనకేసుఁరావటం కాంగ్రెసు పాలన తీరుఁ అద్దం పడుతోంది. వ్యవసాయశాఖ మంత్రి తాను చేసిన ప్రకటనఁ ఁజంగా కట్టుబడి ఉంటే తన సహ మంత్రిపైనే పీడీ చట్టం పెట్టాలన్న డిమాండు ఇప్పుడు ముందుఁ వచ్చింది.
50 వేల ఎకారాల్లో మొలకెత్తఁ పత్తి
శుక్రవారంనాడు వరంగల్ జిల్లా పరకాలలో పత్తి రైతులు రాస్తారోకోఁ దిగారు. మహికో సంస్థఁ చెందిన నీరజ్, స్పిక్ సంబంధిత ఎంఆర్సి -720 రకం బిటి పత్తి విత్తి పది రోజులవుతున్నా మొలకెత్తకపోవటంతో రైతన్నలు రోడ్డెక్కక తప్పలేదు. రేగొండ మండలంలోఁ రామన్నగూడెం, కొత్తపల్లి, పోచంపల్లి, బాగర్ధిపేట, పరకాల మండలంలోఁ మల్లక్కపేట, రాయపర్తి గ్రామాలఁ చెందిన ఏ ఒక్క రైతు చేన్లోనూ ఈ రకం పత్తి మొలకెత్తలేదు. ఒకటి రెండు గ్రామాల్లోనో, కొందరి పొలాల్లోనో అనర్ధం జరిగిూంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ వరంగల్ జిల్లాలో జరిగింది కొందరికి కాదు. కొఁ్న గ్రామాలకూ పరిమితం కాలేదు. అదేమఁ దుకాణదారులను అడిగితే తమ తప్పేమీ లేదఁ చేతులెత్తేయటంతో రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. అక్రమార్కులను వదిలి ఁరసన తెలుపుతున్న రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుఁఁ పోలీసుస్టేషనులో ఁర్బంధించటం ప్రభుత్వ విధానాలఁ ఁదర్శనం. నకిలీ విత్తనాలను అంటగట్టినందునే మొక్క రాలేదఁ రైతులు గొల్లుమంటున్నారు. కొందరు రైతులు తమ పొరబాటు ఏమన్నా ూందేమోననుఁఁ ఒకటి రెండుసార్లు, మరికొందరు మూడుదఫలు కూడా విత్తనాలను కొఁ విత్తినా ఫలితం దక్కలేదు. పరకాల, రేగొండ మండలాలఁ తోడు ఆ జిల్లాలోఁ జఫర్గడ్, నర్సంపేట, గూడూరు, చిట్యాల, ఆత్మకూరు, సంగెం, దుగ్గొండి, పర్వతగిరి, జనగామ, దేవరుప్పుల, రఘునాథపల్లి మండలాల్లోనూ 50 వేల ఎకరాలలో పత్తి విత్తులు మొలకెత్తలేదంటూ ఫిర్యాదులు ప్రస్తుతం వెల్లువెత్తుతున్నాయి. పైగా రూ. 750 విలువయిన సంచికి రశీదులు ఇచ్చి మరీ రూ. 1200 నుంచి రూ. 1500 దాకా దుకాణదారులు వసూలు చేశారు. వరంగల్ జిల్లా అంతటా నకిలీ విత్తనాలు అమ్మిన అక్రమార్కులఁ వ్యవసాయశాఖామాత్యులు ఏ శిక్ష విధిస్తారో వేచిచూడాలి.
అమాత్యులదీ, అధికారులది అదేతీరు
పాలకపక్ష విధానాలే ఇఁ్న అనర్థాలు తెచ్చిపెడుతున్నాయి. ”బర్రె చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?” అన్నట్లుగా సచివులను బట్టే అధికారులూ గడ్డిమేస్తూ రైతులను ఁలువునా ముంచుతున్న నకిలీ విత్తన వ్యాపారులఁ అడుగులఁ మడుగులొత్తుతున్నారు. రాష్ట్రంలో గిరాకి ఉన్న పత్తి విత్తనాల చుట్టూ అక్రమాలు కోకొల్లలుగా సాగుతున్నాయి. జిఁ్నంగు మిల్లుల నుంచి సాధారణ విత్తనాలను కొనుగోలుచేసి అందమైన ప్యాకింగుల్లో దళారులు రైతులఁ అంటగడుతున్నారు. మరి కొందరు కాలం చెల్లిన విత్తనాలను కొత్త సంచుల్లో పోసి అమ్ముతున్నారు. అందులోనూ ఁరక్షరాస్యులయిన రైతన్నలు సంచుల మీద ముద్రించిన బొమ్మల్ని బట్టి కొనుగోలు చేయటాఁ్న ఆసరాగా చేసుఁఁ అక్రమార్కులు ప్రముఖ సంస్థలయిన మహికో, స్పిక్,
మోన్శాంటో, తులసి, నూజివీడు, తదితర పేర్లమీద నకిలీ విత్తనాలను అమ్మకాఁకి పెట్టి సొమ్ముచేసుఁంటున్నారు. దీఁకితోడు ధరల ఁయంత్రణ కూడా అమలు కావటం లేదు. బిటి పత్తి విత్తనాలను రూ. 750 మించఁండా అమ్మాలఁ ప్రభుత్వం శాసించినా వాస్తవంలో అమలుకావటంలేదు. సమస్య తీవ్రంగా నెలకొన్న సమయంలో రైతుల కన్నీళ్లు తుడిచేందుఁ చట్టాలు చేసినా అమలు చేయకపోవటంతో కష్టాలు తప్పటం లేదు.
కానరాఁ ముందస్తు చర్యలు
సార్వా ప్రారంభం కాకముందే వ్యవసాయశాఖ తమ విధుల్ని ఁర్వర్తించి ూంటే నకిలీల బెడద ఇంతగా ూండకపోను. దుకాణాలఁ చేరిన విత్తనాల నమూనాలను సేకరించి మొలక తీరును పరిశీలించాల్సిన బాధ్యత వ్యవసాయశాఖదే. పరిశీలనలో నకిలీవఁ తేలితే వాటిఁ వెంటనే ఁషేధించాలి. అయితే విత్తన సంస్థల మొదలు విత్తన దుకాణదారులదాకా అందరి నుంచీ సార్వా, దాళ్వాలవారీగా వ్యవసాయశాఖ అధికారులు ముడుపులు మూటగట్టుఁఁ తమ విధుల్ని ఆవలబెట్టటంతో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయి. ఈ పఁ చేయఁండా హామీలు, ఘీంకారాలూ, హAంకరింపులు అక్రమార్కులను అడ్డగించలేవు. రైతన్నలను రక్షించలేవు. ముందస్తు జాగ్రత్తతో ఏనాడూ నకిలీ విత్తనాలను కనుగొన్న దాఖలాలు లేవఁ రైతు సంఘాలు విమర్శిస్తుండగా, వ్యవసాయశాఖ స్పందించకపోవటం పరిశీలనార్హం.
26 జూన్
Posted by కొత్తపాళీ on జూన్ 30, 2010 at 4:34 సా.
సార్ మీరు తెలుగు టైపింగులో కొన్ని విచిత్రమైన అక్షరాలేవో వాడుతున్నట్లు ఉన్నారు. అవి యూనికోడులో సరిగా కనపడ్డం లేదు. గమనించ ప్రార్ధన.